రేపు వారితో భేటీ అవ్వనున్న వైఎస్ జగన్

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం సభ్యులతో మంగళవారం నాడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు

By Medi Samrat
Published on : 30 Jun 2025 8:04 PM IST

రేపు వారితో భేటీ అవ్వనున్న వైఎస్ జగన్

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం సభ్యులతో మంగళవారం నాడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమవనున్నారు. ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొంటారు.

ఇక సింగయ్య మృతికి సంబంధించిన కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై రేపు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో పిటిషనర్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Next Story