16న గణపవరంకు సీఎం జ‌గ‌న్‌

YS Jagan to tour Ganapavaram on May 16 to distribute Rythu Bharosa cheques. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీన గణపవరం

By Medi Samrat  Published on  11 May 2022 11:24 AM GMT
16న గణపవరంకు సీఎం జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా గణపవరం చేరుకుని వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద రైతులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గణపవరం వస్తారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రయాణించే హాలు, హెలిప్యాడ్, రోడ్డు మార్గాలను పరిశీలిస్తామని చెప్పారు.







Next Story