మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా : వైఎస్ జగన్

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారని ఆ పార్టీ చెబుతోంది.

By Medi Samrat
Published on : 28 March 2025 3:36 PM IST

మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా : వైఎస్ జగన్

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారని ఆ పార్టీ చెబుతోంది. దీనిపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థులను ఇబ్బందులు పెట్టినా కూడా పోరాడారంటూ కితాబిచ్చారు.

"స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, చంద్రబాబు గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైయస్సార్‌కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకున్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌." అంటూ పోస్టు పెట్టారు.

Next Story