కర్నూలులో ప‌వ‌ర్‌ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ శంకుస్థాపన

YS Jagan lays foundation stone for integrated renewable energy storage project in Kurnool. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  17 May 2022 9:25 AM GMT
కర్నూలులో ప‌వ‌ర్‌ ప్రాజెక్టుకు వైఎస్ జగన్ శంకుస్థాపన

ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కర్నూలులో హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ప్రపంచంలోనే తొలి జలవిద్యుత్‌ ప్లాంట్‌కు కర్నూలు వేదిక కావడం గర్వకారణమని అన్నారు. గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని, దీంతో జిల్లాలోని నిరుద్యోగులకు భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వైఎస్ జగన్ తెలిపారు.

హైడల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో 15,000 ఉద్యోగాలు ఐదేళ్లపాటు కొనసాగుతాయని, 3,000 మందికి ప్రత్యక్షంగా, మరో 5,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని జగన్ అన్నారు. ఓర్వకల్‌ పీజీసీఐఎల్‌/సీటీయూ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ద్వారా దేశంలోని డిస్కమ్‌లు, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు మొత్తం 5,410 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి జాతీయ గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు.

గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించింది.
















Next Story