వైసీపీ నేత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.

By Medi Samrat
Published on : 6 Jun 2025 6:04 PM IST

వైసీపీ నేత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్‌ నుంచి కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడారు. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ కి తెలిపారు. నారాయణరెడ్డి మరణం భార్య, ఇద్దరి పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపింది. వారి కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.

Next Story