గౌతమ్‌రెడ్డి కలలను నెరవేరుస్తా : సీఎం జ‌గ‌న్‌

YS Jagan assures of fulfilling dreams of late minister Mekapati Goutham Reddy. వెనుకబడిన ప్రాంతమైన ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

By Medi Samrat  Published on  28 March 2022 9:42 AM GMT
గౌతమ్‌రెడ్డి కలలను నెరవేరుస్తా : సీఎం జ‌గ‌న్‌

వెనుకబడిన ప్రాంతమైన ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కలలను నెరవేరుస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. సోమవారం కనుపర్తిపాడు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన సంతాప సభలో ఆయన పాల్గొని మంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ ఎంపీ, తండ్రి గౌతమ్‌ల అభ్యర్థనను గౌరవిస్తూ ఉదయగిరిలోని తమ కళాశాలను అగ్రికల్చర్/హార్టికల్చర్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. మే 15 నాటికి సంగం బ్యారేజీ పనులు పూర్తి చేస్తామని, మళ్లీ ప్రారంభోత్సవానికి వస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు స్మారక చిహ్నంగా ఉండాలని.. అందుకే మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీగా నామకరణం చేశామన్నారు.

గౌతమ్‌రెడ్డితో తన చిన్ననాటి అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జగన్‌.. తనకు వెన్నుదన్నుగా, మద్దతుదారునిగా, ప్రభుత్వానికి బలమైన స్తంభంగా ఉన్నార‌ని చెప్పారు. రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి చురుకైన పాత్ర పోషించాలని గౌతమ్ ను ప్రోత్సహించారని చెప్పారు. గౌతమ్ గొప్ప వ్యక్తి అని.. ఆరు ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలను ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్వహించారని.. అనుకోని విధంగా అకస్మాత్తుగా మ‌న నుండి దూర‌మైపోయార‌ని జగన్ అన్నారు. గౌతమ్ మరణం నాకు భరించలేని వేదన అని జ‌గ‌న్‌ అన్నారు. ఈ సమావేశానికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కె. శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించారు. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి అనిల్‌కుమార్‌ యాదవ్‌, గౌతమ్‌ తండ్రి రాజమోహన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వీ ప్రభాకర్‌రెడ్డి, శాసనసభ్యులు, కలెక్టర్‌ చక్రధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.










Next Story