వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా.. అన్నతో కలిసి..

YCP MLA Roja plays volleyball in puthur. వైసీపీ ఎమ్మెల్యే రోజా వాలీబాల్‌ గేమ్ ఆడారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఎస్‌ఆర్‌ఎస్‌ కాలేజీలో వాలీబాల్‌ టోర్నమెంట్‌ను

By అంజి  Published on  5 Nov 2021 11:17 AM GMT
వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా.. అన్నతో కలిసి..

వైసీపీ ఎమ్మెల్యే రోజా వాలీబాల్‌ గేమ్ ఆడారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఎస్‌ఆర్‌ఎస్‌ కాలేజీలో వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సోదరుడు రామ్‌ ప్రసాద్‌ రెడ్డితో కలిసి హుషారుగా వాలీబాల్‌ ఆడారు. ఆట స్థలంలో ఎంతో హుషారుగా కనిపించారు రోజా. ఆటగాళ్లలో క్రీడా ఉత్సహాన్ని నింపారు. గేమ్‌లో అన్నా చెల్లెలు పోటీ పడటం అక్కడుఉన్న ప్రేక్షులను ఉత్తేజ పరిచింది. సరదాగా సాగిన వాలీబాల్‌ గేమ్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది.

ఈ పోటీలను నవంబర్‌ 17న ఎమ్మెల్యే రోజా పుట్టిన రోజును పురస్కరించుకొని రోజా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇతర క్రీడలకు కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 16 వరకు ఈ క్రీడా పోటీలు కొనసాగనున్నాయి. రోజా తను వాలీబాల్‌ ఆడిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ మీట్ కి సంబంధించి కమిటీ సభ్యులు, వాలీబాల్ స్పోర్ట్స్ ఇన్చార్జులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story