పవన్ కళ్యాణ్ గెలవాలని.. అభిమాని చిరంజీవి ఏమి చేసాడంటే?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మీద వైసీపీ తరపున వంగా గీత నిలబడ్డారు

By Medi Samrat
Published on : 1 Jun 2024 6:15 PM IST

పవన్ కళ్యాణ్ గెలవాలని.. అభిమాని చిరంజీవి ఏమి చేసాడంటే?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మీద వైసీపీ తరపున వంగా గీత నిలబడ్డారు. ఇంకొద్ది రోజుల్లో పవన్ ఫలితాలు రావాల్సి ఉండగా.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన గెలవాలంటూ ఆలయాలకు పోటెత్తుతూ ఉన్నారు. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా అంజనాద్రిపై వెలసిన జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు.

అందులో ఓ వ్యక్తి పొర్లు దండాలు పెట్టడం విశేషం. జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజారిటీతో గెలవాలని చంద్రగిరికి చెందిన చిరంజీవి అనే వ్యక్తి జాపాలి కాలిబాటలో పొర్లు దండాలు పెట్టారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ, దేశంలోనూ అధికారంలోకి రావాలని కోరుకుంటూ పొర్లు దండాలు పెట్టారు. గతంలో చిరంజీవి కోసం సైకిల్ యాత్ర కూడా చేశారు. అంతేకాకుండా మెగా కుటుంబానికి వీరాభిమాని అయిన చిరంజీవి.. మెగాస్టార్ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని శ్రీ వారి మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు గతంలో చేరుకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజారిటీతో గెలవాలని కోరుకున్నట్లు చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Next Story