ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరవ్వలేదు. శనివారం ఉదయం 10 గంటలకు సిట్ ముందు విచారణకు విజయసాయి హాజరుకావాల్సి ఉంది. ఈరోజు విచారణకు తాను హాజరుకాలేనని సిట్ అధికారులకు విజయసాయి సమాచారం అందించారు. తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందువల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని, విచారణకు వచ్చే తేదీని తెలియజేస్తానన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 18న విజయసాయి తొలిసారి సిట్ విచారణకు హాజరయ్యారు.
ఇక ఈరోజు ఉదయం విజయసాయి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
"కర్మణ్యే వాధికారస్తే
మాఫలేషు కదాచన!
మా కర్మఫలహేతుర్భూ:
మా తేసంగోஉస్త్వకర్మణి!!
కర్మలను ఆచరించుట యండే నీకు అధికారము కలదు
కానీ వాని ఫలితముల మీద లేదు.
నీవు కర్మఫలములకు కారణం కారాదు.
అట్లని కర్మలను చేయుట మానరాదు.
శ్రీ శ్రీ భగవద్గీత." అంటూ పోస్టు పెట్టారు.