మరో గుడ్న్యూస్ చెప్పిన టీటీడీ..శ్రీవారి లడ్డూ కోసం ఇక నుంచి నో లైన్
తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
మరో గుడ్న్యూస్ చెప్పిన టీటీడీ..శ్రీవారి లడ్డూ కోసం ఇక నుంచి నో లైన్
తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని తగ్గించేందుకు కియోస్క్ల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకునే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సరికొత్త విధానాన్ని ఆదివారం ప్రారంభించింది. వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదును చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి అధిక సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు కౌంటర్ల వద్ద రద్దీ పెరుగుతుంటుంది.
ఇప్పుడు వీటిని నియంత్రించేందుకు కియోస్క్ల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చింది. భక్తుడు తన దర్శన టికెట్ నంబర్ను కియోస్క్లో ఎంటర్ చేసి, తనకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వచ్చే రసీదును లడ్డూ కౌంటర్లో ఉన్నవారికి ఇస్తే అక్కడ లడ్డూలు అందిస్తారు. దర్శన టికెట్లు లేనటువంటి భక్తులు తమ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు.
ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో 3 కియోస్క్లను ఏర్పాటు చేశారు. తిరుమల వ్యాప్తంగా సీఆర్వో ఎంక్వైరీ సెంటర్, శ్రీ పద్మావతి విచారణ కేంద్రం, ప్రముఖ గెస్ట్హౌస్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను కూడా కియోస్క్ల ద్వారా పొందేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది.