ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం 11 మంది ఐపీఎస్‌ అధికారులకు స్థాన చ‌ల‌నం క‌ల్పించింది.

By Medi Samrat  Published on  5 Sep 2023 10:20 AM GMT
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం 11 మంది ఐపీఎస్‌ అధికారులకు స్థాన చ‌ల‌నం క‌ల్పించింది. అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సీపీగా ఏ రవిశంకర్‌, విశాఖ శాంతి భద్రతల డీసీపీగా కె శ్రీనివాసరావు, వైఎస్సార్‌ జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌశల్‌, అనంతపురం ఎస్పీగా అన్బురాజన్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఐజీగా త్రివిక్రమ వర్మ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు డీజీగా కుమార్‌ విశ్వజిత్‌, గ్రేహౌండ్స్‌ ఎస్పీగా వి విద్యాసాగర్‌ నాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు, 14వ బెటాలియన్‌ కమాండెంట్‌గా ఆర్‌ గంగాధరరావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్‌ నయీం అస్మి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పి జగదీశ్‌‌లను నియమించింది.

Next Story