ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12 నుంచి 14 వరకూ లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి ఇంకా డబ్బు జమ కానీ వారు గ్రామ/వార్డు సచివాలయాలలో కంప్లైంట్ ఇవ్వొచ్చని మంత్రి లోకేష్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ గడువు ఇవాళ్టి (జూన్ 26)తో ముగియనుంది. దీంతో రేపటి నుంచి ఫిర్యాదులను పరిశీలన చేయనున్నారు. అర్హులు అని తేలితే, జూన్ 30 నుంచి వారి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది.