ముగ్గురు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఊహించని విషాదం నెలకొంది. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

By Medi Samrat  Published on  28 Jan 2024 3:45 PM GMT
ముగ్గురు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఊహించని విషాదం నెలకొంది. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. సరదాగా స్నానానికి నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్ గా గుర్తించారు. నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు మృతి చెందారు. నది ఒడ్డుపై ఉన్న కానూరు సనత్ నగర్ చెందిన షేక్ షారుక్ ప్రాణాలు దక్కించుకోగలిగాడు. కాగా.. నదిలో చనిపోయిన ముగ్గురు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతులందరూ పడమట హైస్కూల్ రోడ్డులోని నారాయణ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Next Story