ఆ మూడు పంటల కొనుగోలుపై రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
By Knakam Karthik
ఆ మూడు పంటల కొనుగోలుపై రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. మామిడి, పొగాకు, కోకో పంటల కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని ప్రకటించింది. కోకో, మామిడి, పొగాకు పంట ఉత్పత్తుల గిట్టుబాటు ధర, కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. రైతులు నల్లబెల్లి పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని సూచించారు. మామిడి పంటలను కొనుగోలుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోకో విషయంలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చేస్తామని మంత్రి అచ్చెన్న హామీ ఇచ్చారు.
రైతుల ప్రయోజనాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. హార్టికల్చర్, ఆక్వాకల్చర్, ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని తెలిపారు. అనుకున్న సమయంలో సాయం చేయడంతో పాటు, ఫీల్డ్కు వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సీఎం సూచించారు. రైతుల్లో అసంతృప్తి తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యేలను ముందుగానే అంచనా వేయాలని, కోకో పాలసీ తీసుకురావాలి. మంచి నాణ్యత ఉండేలా రైతుల్ని చైతన్య పరచాలి. ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ఉండేలా చూడాలి. ఎఫ్పీవోలు ఎంఎస్ఎంఈలు నెలకొల్పేలా, ప్రాసెసింగ్ జరిగేలా ప్రోత్సహించాలి..అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.