చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం

ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతలు సమావేశమయ్యారు. రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది.

By Medi Samrat  Published on  12 April 2024 2:00 PM GMT
చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం

ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతలు సమావేశమయ్యారు. రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. ఈ కీలక భేటీలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార తీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నేతలు చర్చించారు.

ప్రధాని మోదీ రాక:

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపై ఈ సమావేశంలో సమీక్షించారు. బూత్, అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పరిధిలో కూటమి నేతల సమావేశాలు జరపాలని నిర్ణయించారు. ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ఎన్డీయే నేతలు చర్చించారు. కూటమి తరఫున ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. 160కి పైగా అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు సాధించడమే లక్ష్యం పెట్టుకోవాలని నిర్ణయించారు.

Next Story