Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి

2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Knakam Karthik
Published on : 21 Aug 2025 10:15 AM IST

Andrapradesh, Ap Government, MGNREGS works, Ysrcp, Tdp

Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి

అమరావతి: 2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులకు బిల్లులు చెల్లించలేదని, బిల్లులు ఇవ్వకుండా వర్కులను క్లోజ్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శద్ద పెట్టింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం చంద్రబాబు ఈ విషయంపై పలు మార్లు చర్చించి నిధుల చెల్లింపులకు ఉన్న అడ్డంకులను తొలగించారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం క్లోజ్ చేసిన 3,54,177 పనులు ప్రస్తుతం ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పుచేశారు. కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటుతో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లింపు చేయడం ద్వారా న్యాయం చేసే అవకాశం ఏర్పడింది.

ఈ ప్రక్రియపై సీఎం చంద్రబాబు సచివాలయంలో బుధవారం మరో సారి సమీక్ష చేశారు. మొత్తం రూ.179.38 కోట్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించి 5.54 లక్షల పనులను ఆన్ గోయింగ్ వర్కులుగా నమోదు చేశారు. దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసిన పంచాయతీ రాజ్ శాఖ రూ.179 కోట్లకు గాను రూ.145 కోట్లను ప్రస్తుతం అప్లోడ్ చేసింది. ఈ మొత్తానికి సంబంధించి ఆర్థిక శాఖ ఎన్ఐసికి నిధులు విడుదల చేసింది. పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు, గ్రామస్తుల అకౌంట్లలో 23వ తేదీన ఈ మొత్తం నిధులు జమకానున్నాయి. మిగిలిన మొత్తానికి సంబంధించి పలు సాకేంతిక కారణాలతో చెల్లింపు ప్రక్రియ నిలిచింది. అవసరమైన ఎస్టిమేషన్ లేకపోవడం, ఖర్చు చూపకపోవడం, ఆ పనిచేసిన ప్రాంతాలు పట్టణ ప్రాంతంలో విలీనం కావడం వంటి కారణాలతో ఆయా పనుల బిల్లుల చెల్లింపు ప్రక్రియ పెండింగ్‌లో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Next Story