విద్యార్థులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి రూ.15 వేలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విద్యార్థులకు శుభవార్త చెప్పింది.

By Knakam Karthik
Published on : 12 Jun 2025 6:41 AM IST

Andrapradesh, Cm Chandrababu, Ap Government, Talliki Vandanam Scheme

విద్యార్థులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి రూ.15 వేలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విద్యార్థులకు శుభవార్త చెప్పింది. సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన మరో హామీని ఇవాళ్టి నుంచి అమలు చేయనున్నారు. నేడే 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున తల్లుల అకౌంట్లలో నగదు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8745 కోట్లను కేటాయించింది. 67 లక్షల మంది తల్లికి వందనం పథకం నిధులను ఖాతాల్లో జమ చేయనుంది.

కాగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం అమలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే 67,27,1645 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింప జేయనున్నారు. 1వ తరగతిలో ప్రవేశం పొందే పిల్లలు, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనూ నిధులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది.

Next Story