ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి

Supreme Court collegium approves promotion of seven lawyers as AP High Court judges. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త న్యాయవాదులు

By Medi Samrat  Published on  31 Jan 2022 9:15 AM GMT
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త న్యాయవాదులు పదోన్నతి పొందారు. ఈ నెల 29న జరిగిన సమావేశంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఈ సిఫార్సులను ఆమోదించింది. న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన వారిలో కోనగంటి శ్రీనివాస రెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చిములపాటి, వి.సుజాత ఉన్నారు.

అలాగే గతేడాది నవంబర్‌లో ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాది కె. మన్మథరావు, న్యాయమూర్తి బిఎస్ భానుమతిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించారు. అనంతరం ఇద్దరు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా మరో ఏడుగురు న్యాయమూర్తులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సిఫార్సు చేసింది. కేంద్రం నుంచి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Next Story