ఏపీ హైకోర్టులో రామ్‌ గోపాల్‌ వర్మకు ఊరట

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ల చిత్రాలను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలపై డైరెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

By Medi Samrat
Published on : 10 Dec 2024 8:49 PM IST

ఏపీ హైకోర్టులో రామ్‌ గోపాల్‌ వర్మకు ఊరట

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ల చిత్రాలను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలపై డైరెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్టర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు, కానీ ఆయన కోర్టును ఆశ్రయించడంతో అది వీలవ్వలేదు. కోర్టు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

రామ్ గోపాల్ వర్మ తనపై నమోదైన కేసులను సరైన చట్టపరమైన పద్ధతితో డీల్ చేసి బెయిల్ పొందారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులపై కేసులు పెట్టి జైలుకు పంపుతోంది. రామ్ గోపాల్ వర్మను అన్ని విధాలుగా జైలుకు పంపాలని ప్రభుత్వం భావించింది కానీ అది జరగలేదు.

Next Story