లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలపై రఘురామ అభ్యంతరం

Raghurama Raju Comments On Laxmi Parvathi Words. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కొన్ని వారాల పాటు వ‌రుస‌గా లేఖలు రాస్తూ వస్తున్నారు వైసీపీ

By Medi Samrat  Published on  17 July 2021 9:19 AM GMT
లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలపై రఘురామ అభ్యంతరం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కొన్ని వారాల పాటు వ‌రుస‌గా లేఖలు రాస్తూ వస్తున్నారు వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు. తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చడాన్ని తప్పుబట్టారు. సంస్కృత అకాడమీ కావాలంటే దాని కోసం వేరుగా అకాడ‌మీ పెట్టుకోవాల‌ని, అలా ఆ భాష‌ను అభివృద్ధి చేసుకోవాల‌ని తెలుగు భాషాభిమానులు అంటున్నార‌ని మీడియా సమావేశంలో రఘురామ కృష్ణరాజు చెప్పారు. తెలుగు, సంస్కృత అకాడమీ అంటూ రెండింటినీ క‌లిపి వ్య‌వ‌హ‌రించ‌డం సరికాద‌ని అన్నారు.

ల‌క్ష్మీపార్వ‌తి వ‌య‌సులో పెద్ద వార‌ని, అటువంటి వ్య‌క్తి తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చ‌డాన్ని స‌మ‌ర్థిస్తున్నార‌ని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ హోదాలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి? అని అంటున్నార‌ని, రెండు భాష‌లు పేక‌ముక్క‌ల్లా క‌లిసి పోతాయ‌న్నార‌ని రఘురామ కృష్ణరాజు చెప్పారు. క‌నీసం పాలు, నీళ్ల‌లా క‌లిసిపోతాయ‌ని అయినా అన‌లేద‌ని పేక‌ముక్క‌లు అంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని ర‌ఘురామ అభ్యంతరం వ్య‌క్తం చేశారు.

పేక‌ముక్క‌లు అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని నేను ల‌క్ష్మీపార్వ‌తిని విన్నవించుకుంటున్నానని రఘురామ అన్నారు. జూద‌ప్రియుల‌కు త‌ప్ప ఇత‌రులెవ్వ‌రికీ రుచించ‌ని విధంగా ఆమె మాట్లాడ‌డం స‌రికాద‌ని, ఆ ప‌ద ప్ర‌యోగం వ‌ల్ల తెలుగు భాష‌ను ప్రేమించేవారంతా బాధ‌ప‌డుతున్నారని రఘురామ కృష్ణరాజు అన్నారు. అంత గొప్ప అకాడ‌మీకి చైర్మ‌న్‌గా ఉన్న ఆమె స్థాయికి ఈ ప‌ద ప్ర‌యోగం త‌గ‌ద‌ని చెప్పారు.


Next Story