అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం..ఎక్స్గ్రేషియా ప్రకటన
అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By - Knakam Karthik |
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం..ఎక్స్గ్రేషియా ప్రకటన
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియాలో రాష్ట్రపతి, ప్రధాని ప్రకటించారు.
రాష్ట్రపతి తీవ్ర విచారం
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జరిగిన దుర్ఘటనాత్మక బస్ ప్రమాదంలో ప్రాణనష్టం చోటుచేసుకున్న సంగతి తెలిసి తీవ్ర విచారం కలిగింది. మరణించిన వారి కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను...అని రాష్ట్రపతి సంతాపం తెలిపారు.
Pained to know about the loss of lives in a tragic bus accident in Alluri Sitharama Raju District of Andhra Pradesh. I extend my heartfelt condolences to the bereaved families and pray for quick recovery of those injured.
— President of India (@rashtrapatibhvn) December 12, 2025
రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా: మోదీ
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జరిగిన బస్ ప్రమాదంలో ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలపట్ల నా ఆలోచనలు ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి మృతుని కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా సాయం అందించబడుతుంది. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఇవ్వబడుతుంది..అని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.
Pained by the loss of lives due to a bus mishap in the Alluri Sitharama Raju district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.An ex-gratia of Rs. 2 lakh from PMNRF…
— PMO India (@PMOIndia) December 12, 2025