ఐదు విభాగాల్లో నంది నాటక అవార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం : పోసాని కృష్ణ మురళి

Posani Krishna Murali said that we have decided to give Nandi Natak Awards in five categoriesనంది నాటక అవార్డులను ఐదు విభాగాల్లో అర్హులైన కళాకారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్

By Medi Samrat  Published on  4 July 2023 2:13 PM GMT
ఐదు విభాగాల్లో నంది నాటక అవార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం : పోసాని కృష్ణ మురళి

నంది నాటక అవార్డులను ఐదు విభాగాల్లో అర్హులైన కళాకారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర పిల్మ్‌, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మట్లాడుతూ.. ఈ ఏడాది నంది నాటక అవార్డులను ప్రధానం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ఎంతో నమ్మకంతో తనకు రాష్ట్ర పిల్మ్‌, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేటప్పుడే ఎటు వంటి వివాదాలకు తావులేకుండా నంది నాటక అవార్డులను ఉత్తమ కళాకారులకు అందజేయాలని ఆదేశించారన్నారు. వారి ఆదేశాలమేరకు అర్హులైన కళాకారులకు ఈ నంది నాటక అవార్డులను ఇచ్చేందుకు చర్యలు చేపట్టడమైందన్నారు. అయితే ఒకే సారి చిత్ర, టీవీ నాటక రంగాలకు చెందిన కళాకారులకు నంది నాటక అవార్డులు ఇవ్వడం చాలా కష్టమనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడమైందన్నారు. వారి అనుమతితో తొలుత పద్య, సాంఘిక, బాలలు, యువజన నాటకాలతో పాటు సాంఘిక నాటిక అనే ఐదు విభాగాల్లోని ఉత్తమ కళాకారులకు ఈ నంది నాటక అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నంది నాటక అవార్డులు ఆ వర్గానికో ఈ వర్గానికో కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే ఇవ్వాలన్నదే మా లక్ష్యం అన్నారు.

1998 నుండి 2004 వరకూ నంది నాటక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాదు రవీంద్రభారతికే పరిమితం అయిపోయిందన్నారు. అయితే 2005 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తదుపరి వారి సూచనల మేరకు ఈ నంది నాటక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జిల్లాల్లో కూడా నిర్వహించడం ప్రారంభం అయిందన్నారు. అందుకు తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, నిజామాబాద్ తదితర జిల్లాలలోని ఆడిటోరియంలను పునర్‌నిర్మించ‌డం జరిగిందని ఆయన తెలిపారు.

పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెపుతూ.. ఏపీలో ఉచితంగా షూటింగ్ లు చేసుకోవచ్చని ఉత్తర్వులే ఉన్నాయని, ఏపీలోనూ సినీపరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రం విడిపోయాక సినిమా పరిశ్రమకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర పిల్మ్‌, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది నంది నాటక అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పద్య, సాంఘిక, బాలలు, యువజన నాటకాలతో పాటు సాంఘిక నాటిక అనే ఐదు విభాగాల్లో మొత్తం 73 అవార్డులను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇందు కోసం బుధవారం నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని, ధరఖాస్తు చేసుకునేందుకు ఒక మాసం గడువు ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్ము, టివి, థియెటర్ డవలెప్మెంట్ కార్పొరేషన్ అఫిషియెల్ వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేస్తుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు నాటక సమాజాలు కూడా ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చన్నారు. ధరఖాస్తు చేసుకున్నవారు వారి ధరఖాస్తును ఉపసంహరించుకునేందుకు వారం రోజుల పాటు గడువు కూడా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ గడువు పూర్తయిన తదుపరి కళాకారుల ప్రదర్శనను ప్రాథమిక స్థాయిలో పరిశీలించేందుకు వారు ప్రదర్శించే చోటికే జూరీ సభ్యులు వెళతారన్నారు. ప్రాథమిక స్థాయిలో ఎంపికైన కళాబృందాలను రాష్ట్ర స్థాయిలో నిర్వహించే తుది పోటీలకు అనుమతించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో ఆడిటోరియంలు ఉన్నాయని, అయితే రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎక్కడ నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రంలో తుది పోటీలను ఆరు రోజుల పాటు నిర్వహించి, ఏడో రోజు నంది నాటక అవార్డుల ప్రదానోత్సం జరుగుతుందని ఆయన తెలిపారు.


Next Story