మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నోటీసులు

వైసీపీ నేత‌, మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

By Medi Samrat
Published on : 24 July 2025 2:15 PM IST

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నోటీసులు

వైసీపీ నేత‌, మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డిని దూషించిన కేసులో ఈ నెల 26న ఉద‌యం 10 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయ‌న ఇంట్లో లేక‌పోవ‌డంతో నివాసానికి కోవూరు ఎస్ఐ రంగ‌నాథ్ గౌడ్ నోటీసులు అంటించారు. ఈ కేసులో ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని దూషించిన వ్యవహారంలో అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై అనిల్ యాదవ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story