అన్నదాతలకు గుడ్ న్యూస్..నేడే అకౌంట్లలోకి రూ.6,000 జమ

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధులను దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.32 కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయనున్నారు

By -  Knakam Karthik
Published on : 13 March 2026 5:52 AM IST

Andrapradesh, PM Kisan, Annadatha Sukhibhava, PM Modi,  AP CM ChandraBabu

అన్నదాతలకు గుడ్ న్యూస్..నేడే అకౌంట్లలోకి రూ.6,000 జమ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అస్సాం పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధులను దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.32 కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ₹2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని పీఎం కిసాన్‌తో అనుసంధానిస్తూ, ఉగాది పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతులకు ఈ విడతలో మొత్తం ₹6,000 చొప్పున నగదు అందుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా ₹2,000 కాగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ₹4,000 కలిపి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.

ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రైతుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి, అలాగే మీ పేమెంట్ స్టేటస్‌ను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ annadathasukhibhava.ap.gov.in ను సందర్శించవచ్చు. అక్కడ మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా వివరాలను సరిచూసుకోవచ్చు. ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు జమ కాకపోతే, మీ ఆధార్ సీడింగ్ మరియు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం.

Next Story