వరుస రాళ్ల దాడులు.. నిన్న పవన్.. మొన్న సీఎం జగన్.. నెక్స్ట్ చంద్రబాబేనా?
గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుండగా ఎవరో రాళ్లతో దాడి చేశారు.
By అంజి
వరుస రాళ్ల దాడులు.. నిన్న పవన్.. మొన్న సీఎం జగన్.. నెక్స్ట్ చంద్రబాబేనా?
వచ్చే నెలలో జరగనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుండగా ఎవరో రాళ్లతో దాడి చేశారు. అయితే ఈ రాళ్ల దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ-జేఎస్పీ-బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్కు దూరంగా రాయి పడింది. ఈ ఘటనతో ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. రాయి విసిరిన వ్యక్తిని జేఎస్పీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎవరో రాళ్లతో దాడి చేయడంతో గాయపడిన ఘటన జరిగిన మరుసటి రోజు జరిగింది. శనివారం అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో రాయి తగలడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత ఎడమ కనుబొమ్మపై గాయమైంది. వైద్యులు వెంటనే అతనికి ప్రథమ చికిత్స అందించారు. ఈ రాయి దాడుల ఘటనలు చూస్తుంటే ఎవరో కావాలనే చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ చంద్రబాబుపై కూడా ఇలాంటి జరిగే అవకాశం ఉందని టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు.
“మేమంత సిద్ధం యాత్ర”లో ఉన్న ముఖ్యమంత్రి, దాడి జరిగినప్పుడు ప్రజలకు అభివాదం చేయడానికి ప్రత్యేక ప్రచార బస్సులో నిలబడి ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి పక్కనే నిల్చున్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎడమ కంటికి కూడా గాయమైంది. 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.