ఆ గ్రామంలో ఇళ్లు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి ప‌వ‌న్ రూ. లక్ష సాయం

Pawan Kalyan has-announced one lakh financial assistance to ippatam village victims. ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం

By Medi Samrat  Published on  8 Nov 2022 10:13 AM GMT
ఆ గ్రామంలో ఇళ్లు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి ప‌వ‌న్ రూ. లక్ష సాయం

ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇళ్లు దెబ్బతిన్నాయని వారికి పార్టీ తరపున లక్ష రూపాయలు పవన్ అందజేస్తానని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మళ్లీ ఇళ్లు నిర్మించుకునేందుకు ఈ సాయం అందిస్తున్నామని తెలిపారు.

ఇటీవల గ్రామంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే. కొందరు రైతులు బహిరంగ సభకు స్థలం ఇచ్చారని అందుకే ప్రభుత్వం గ్రామాన్ని కూల్చివేస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇకనైనా కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం మానుకోవాలని కోరారు.


Next Story