సీఎం సాఫ్ట్‌ కార్నర్‌తో ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చారు

Ours is welfare govt, says minister Perni Nani. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు సాఫ్ట్‌ కార్నర్‌తో 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని

By Medi Samrat  Published on  6 April 2022 11:46 AM GMT
సీఎం సాఫ్ట్‌ కార్నర్‌తో ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చారు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు సాఫ్ట్‌ కార్నర్‌తో 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందునే ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి యూనియన్ యాభై ఏళ్ల సుదీర్ఘ సేవలను ప్రశంసించారు.

ఏపీ వాణిజ్య పన్నుల శాఖ దేశంలోనే ఉన్నత స్థానంలో ఉందని, వాణిజ్య పన్నుల శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి సహకారం అందించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ మెజారిటీలో ఉద్యోగుల పాత్రను ఆయన కొనియాడారు. ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని, ఉద్యోగుల సంఘం నాయకుడిగా సూర్యనారాయణ మంచి పనితీరు కనబరిచారని ఆర్థిక మంత్రి కొనియాడారు.

మరోవైపు ప్రజా సంక్షేమంతోపాటు ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందని, ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడ్డారు.















Next Story