19న‌ సీఎం జ‌గ‌న్‌ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ 19వ తేదీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించ‌నున్నారు.

By Medi Samrat  Published on  17 Oct 2023 9:15 AM GMT
19న‌ సీఎం జ‌గ‌న్‌ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ 19వ తేదీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు సీఎం జ‌గ‌న్‌ నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి సీఎంవో అధికారులు షెడ్యూల్ విడుద‌ల చేశారు.

19వ తేదీ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరు చేరుకుంటారు. అక్కడ వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని.. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. కార్యక్రమం అనంతరం అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Next Story