సింగయ్య మృతి కేసు.. వైఎస్‌ జగన్‌కు నోటీసులు

వైసీపీ అధినేత జగన్ ఇటీవలి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది.

By Medi Samrat
Published on : 24 Jun 2025 8:34 PM IST

సింగయ్య మృతి కేసు.. వైఎస్‌ జగన్‌కు నోటీసులు

వైసీపీ అధినేత జగన్ ఇటీవలి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోల ఆధారంగా పోలీసులు వైసీపీ అధినేత జగన్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

ఈ కేసులో జగన్‌ను ఏ2గా పేర్కొన్న పోలీసులు.. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు నోటీసులతో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యాలయ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అంతేకాదు.. సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్నికూడా సీజ్ చేశారు.

Next Story