రేపటి నుండే.. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ

Night curfew in Andhrapradesh from january 18. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రాత్రి క‌ర్ఫ్యూని విధించింది.

By అంజి  Published on  17 Jan 2022 8:09 AM GMT
రేపటి నుండే.. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రాత్రి క‌ర్ఫ్యూని విధించింది. అయితే నైట్ క‌ర్ఫ్యూపై ప్ర‌భుత్వం తొలుత గత సోమ‌వారం రాత్రి నుంచి అమలు చేయాలనుకుంది. కానీ సంక్రాంతి పండుగ రావడంతో నైట్‌ కర్ఫ్యూ విషయంలో మార్పులు చేసింది. సంక్రాంతి తర్వాతే రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు స్పష్టం చేసింది. తొలుత జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను స‌వ‌రించి మళ్లీ జీవో జారీ చేసింది. సవరించిన జీవో ప్రకారం.. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించ‌నున్న‌ట్లు తెలిపింది. సంక్రాంతి పండుగ ముగియడంతో కర్ఫ్యూ రేపు రాత్రి నుండి అమల్లోకి రానుంది.

రాత్రి కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపును ఇచ్చారు. ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు రాత్రి క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించక‌పోతే రూ.100 జ‌రిమానా విధించ‌నున్నారు. ప‌బ్లిక్ గేద‌రింగ్స్‌కు ప‌రిమిత సంఖ్య‌తో కూడిన అనుమ‌తికి నిర్ణ‌యం తీసుకుంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో 200 మంది, ఇండోర్ గేద‌రింగ్స్‌కు 100 మందికి మాత్ర‌మే పర్మిష‌న్ ఇచ్చింది.

Next Story