అమరావతి బిల్లుపై ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు చెప్పిన మంత్రి లోకేశ్

అమరావతి రాజధాని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక పరిణామాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

By -  Knakam Karthik
Published on : 2 April 2026 12:54 PM IST

Andrapradesh, Amaravati, NaraLokesh, PM Modi, AmaravatiBill, CapitalOfAP

అమరావతి బిల్లుపై ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు చెప్పిన మంత్రి లోకేశ్

అమరావతి రాజధాని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక పరిణామాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినందుకు కోట్లాది మంది ఆంధ్రుల తరపున ప్రధానికి లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన ప్రధానికి వివరించారు. ఏళ్ల తరబడి అనిశ్చితి నెలకొన్నా, ఎన్నో కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా అమరావతి కలని సజీవంగా ఉంచిన రైతుల పోరాటం అసాధారణమని కొనియాడారు. రైతుల ఈ మహోన్నత త్యాగానికి గౌరవంగా అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తామని, ఈ ప్రక్రియలో ప్రధాని మార్గదర్శకత్వం, సహకారం ఎంతో అవసరమని లోకేష్ కోరారు. దీనికి సంబంధించి ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరాలను వెల్లడించారు.

Next Story