పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే రోజా

MLA Roja Met Chittoor SP Senthil Kumar. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిశారు

By Medi Samrat  Published on  31 Dec 2021 12:54 PM GMT
పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే రోజా

నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిశారు. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. వైసీపీలో కోవర్టులు ఉన్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీలో ఉంటూ టీడీపీతో జతకలిసిన వారిని క్షమించేది లేదంటూ రోజా స్పష్టం చేశారు. ఫ్లెక్సీల్లో మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ల ఫొటోలు వేసుకుని అధికారులను కూడా బెదిరిస్తున్నారని రోజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అటువంటి వారిని చట్టపరంగా శిక్షించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైనవారే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోవర్టుల అంశాన్ని మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని రోజా వెల్లడించారు.

వైసీపీ కోవర్టులు కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ రోజా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసారు. వైసీపీలో ఉంటూ టీడీపీతో జతకలిసి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. గతంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారు ఇప్పుడు వైసీపీ, మంత్రి రామచంద్రారెడ్డి పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని రోజా మండిపడ్డారు. వైసీపీలో కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారితో పార్టీకి చెడ్డపేరు వస్తుందని.. అటువంటి వారిపై, పార్టీ అధిష్టానం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేసారు.




Next Story