చంద్రబాబుకు భయం పట్టుకుంది : అనిల్ కుమార్ యాదవ్

నాలుగు సంవత్సరాల 11 నెలల పాటూ.. వాలంటీర్లను దొంగలంటూ.. రకరకాలుగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు వాలంటీర్లకి 10 వేల రూపాయలు ఇస్తానంటూ అబద్ధాలు మొదలుపెట్టాడని నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు

By Medi Samrat  Published on  13 April 2024 4:30 PM GMT
చంద్రబాబుకు భయం పట్టుకుంది : అనిల్ కుమార్ యాదవ్

నాలుగు సంవత్సరాల 11 నెలల పాటూ.. వాలంటీర్లను దొంగలంటూ.. రకరకాలుగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు వాలంటీర్లకి 10 వేల రూపాయలు ఇస్తానంటూ అబద్ధాలు మొదలుపెట్టాడని నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడు జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర అద్భుతంగా సాగిందని.. మహిళలు, వృద్ధులు ఎండను కూడా పట్టించుకోకుండా కూడా ప్రతి గ్రామంలో స్వాగతం పలికారన్నారు.

2019లో జరిగిందే.. మరోసారి 2024 లో రిపీట్ కాబోతోందని.. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ పరిపాలన చూసి ప్రజల్లో వచ్చిన స్పందన చూసి చంద్రబాబునాయుడుకి భయం పట్టుకుందన్నారు అనిల్ కుమార్ యాదవ్. రాష్ట్ర ప్రజలు కూటమిని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. పవన్ కళ్యాణ్ డైలాగులు సినిమాల్లో చెప్పుకోవాలని.. రాజకీయాల్లో కాదన్నారు. పిఠాపురంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని.. పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓటమిపాలవుతాడన్నారు.

Next Story