పేదల ఇళ్లకు అదనపు సాయంపై మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల గృహనిర్మాణ లే అవుట్‌ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించారు.

By Medi Samrat
Published on : 27 Jun 2025 2:49 PM IST

పేదల ఇళ్లకు అదనపు సాయంపై మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల గృహనిర్మాణ లే అవుట్‌ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంత‌రం లే అవుట్‌లో ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి పెదవాడికీ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామ‌న్నారు. లే అవుట్‌లో పెండింగ్ పనులను పూర్తి చేసి అందరికీ అందిస్తామ‌ని చెప్పారు.

లే అవుట్ల పరిధిలో స్వయం ఉపాధి కోసం దుకాణ సముదాయం నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని స్థానిక ఎమ్మెల్యేకు సూచించారు. మౌలిక వసతులు కల్పించి.. ఇళ్లను త్వరలోనే అందజేస్తామ‌న్నారు. యుద్ధప్రాతిపదిక విద్యుత్, తాగునీరు సదుపాయం కల్పించేలా.. రోడ్లు వేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల‌తో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసున్నారు.

కాలనీలో అనర్హులు ఇళ్ల స్థలాలు పొందితే.. వాటిని రద్దు చేసి అర్హులకు ఇస్తామ‌న్నారు. రీ లే ఔట్ చేసి 2 సెంట్లు ఇస్తామ‌న్నారు. ఎస్సీ, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు లక్ష రూపాయలు అదనపు సాయం అందిస్తామ‌ని పేర్కొన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున‌ స్థలాలు పేదలకు ఇస్తామ‌న్నారు.

మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story