ఏపీ మెగా డీఎస్సీ ఉద్యోగార్హులకు గుడ్‌న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీన అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వనున్నట్టు పేర్కొంది.

By -  అంజి
Published on : 23 Sept 2025 7:02 AM IST

Minister Lokesh, Pawan Kalyan, DSC Appointments Distribution, APnews

ఏపీ మెగా డీఎస్సీ ఉద్యోగార్హులకు గుడ్‌న్యూస్

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీన అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ నెల 19వ తేదీనే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా.. వర్షాల కారణంగా వాయిదా పడింది. పాఠశాల విద్యా శాఖ ఏపీ మెగా డీఎస్సీ 2025 అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ఇటీవలే విడుదల చేసింది.

ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మున్సిపల్ పాఠశాలలతో పాటు గిరిజన, సామాజిక, బీసీ, బాలల సంక్షేమం, మోడల్, రెసిడెన్షియల్, ప్రత్యేక పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఈ నియామక డ్రైవ్ లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్‌ను ఆయన ఛాంబర్‌లో కలిసి సెప్టెంబర్ 25న జరగనున్న డీఎస్సీ నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం గత ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నంలో రాజకీయ ప్రత్యర్థులు దాదాపు 87 కేసులు పెట్టారని అన్నారు. నియామకాలను పూర్తి చేయడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని, తద్వారా నిరుద్యోగ అభ్యర్థుల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చిందని లోకేష్ చెప్పారు. “సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది ఉపాధ్యాయ ఆశయాల కల చివరకు నెరవేరింది” అని ఆయన అన్నారు.

Next Story