ఏపీ నూత‌న‌ సీఎస్‌గా జవహర్‌రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

KS Jawahar Reddy Appointed New Chief Secretary Andhra Pradesh. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు.

By Medi Samrat
Published on : 29 Nov 2022 9:00 PM IST

ఏపీ నూత‌న‌ సీఎస్‌గా జవహర్‌రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి కొత్త ప్రధానకార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్‌ వరకు ఆయనకు సర్వీసు ఉంది. జవహర్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. సీనియ‌ర్ అధికారులలో ప‌లువురు సీఎస్‌ పోస్టును ఆశించినా.. సీఎం జ‌గ‌న్ మాత్రం జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపారు. ఇదిలావుంటే.. సీఎస్‌గా పదవీవిరమణ చేయ‌నున్న‌ సమీర్‌శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించనున్నట్టు తెలుస్తోంది.


Next Story