ఏపీకి ఏనుగులను పంపిన కర్ణాటక

చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, పార్వతీపురం మన్యం వంటి సరిహద్దు జిల్లాల్లో పెరుగుతున్న మానవ-ఏనుగుల సంఘర్షణలను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం శిక్షణ పొందిన కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అందజేసింది.

By Medi Samrat
Published on : 21 May 2025 2:30 PM IST

ఏపీకి ఏనుగులను పంపిన కర్ణాటక

చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, పార్వతీపురం మన్యం వంటి సరిహద్దు జిల్లాల్లో పెరుగుతున్న మానవ-ఏనుగుల సంఘర్షణలను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం శిక్షణ పొందిన కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అందజేసింది. బెంగళూరులోని విధానసౌధలో ఈ బదిలీ జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కర్ణాటక విధానసౌధలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కుంకీ ఏనుగులను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి గారికి, అటవీ శాఖ మంత్రి గారికి మాట ఇస్తున్నానన్నారు. వాటి సంరక్షణను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. ఈ కుంకీ ఏనుగుల వల్ల భవిష్యత్తులో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతామని, ఆస్తి నష్టాన్ని కూడా నివారించగలుగుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Next Story