వైసీపీకి ఊరట.. కోర్టులో తీర్పు..!

కడప మేయర్‌ సురేశ్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ని పదవి నుంచి తొలగించగా.. ఈ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గురువారం స్టే విధించింది.

By Medi Samrat
Published on : 29 May 2025 2:15 PM IST

వైసీపీకి ఊరట.. కోర్టులో తీర్పు..!

కడప మేయర్‌ సురేశ్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ని పదవి నుంచి తొలగించగా.. ఈ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గురువారం స్టే విధించింది.

కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేశ్ బాబుపై వరుస ఫిర్యాదులు చేశారు. మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సురేష్‌ బాబును మేయర్‌ పదవి నుంచి ఏకపక్షంగా తొలగిస్తూ జీవో జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సురేష్‌ బాబు హైకోర్టును ఆశ్రయించారు. వివరణ ఇచ్చుకోవడానికి మేయర్‌ సురేష్‌ బాబుకు తగిన సమయం కూడా ఇవ్వలేదని, అంతలోనే ఆయన్ని డిస్‌క్వాలిఫై చేశారని సురేష్‌ బాబు తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కడప మేయర్‌ తొలగింపునపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story