KA Paul : చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నారు.. ముందే అనుకుంటే..

చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నారని.. కానీ ఆయన వరదలకు ముందే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు

By Medi Samrat  Published on  3 Sep 2024 3:45 PM GMT
KA Paul : చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నారు.. ముందే అనుకుంటే..

చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నారని.. కానీ ఆయన వరదలకు ముందే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈ వరదలు రావడానికి కారణం అక్రమ నిర్మాణాలని అన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తే గుండె తరుక్కుపోతోందని.. వరదల కారణంగా ఇన్ని లక్షల మంది ఇళ్లు కోల్పోతారని అనుకోలేదన్నారు. ప్రాణం పోయిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు కోటి రూపాయలు చెల్లించాలని, వరద బాధితులకు తక్షణమే ఆహారం, నీరు, ఆశ్రయం అందించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు అడిగి తీసుకోవాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి.. వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని.. సహాయక విధుల్లో నిమగ్నమైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సూచించారు. రెండు రోజుల పాటు తిండి, నీరు లేకుండా ఉంటే కలిగే బాధను అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పారు. బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట డ్రోన్లు, హెలికాఫ్టర్లు ఉపయోగించాలని సూచించారు.

Next Story