హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు.

By -  Medi Samrat
Published on : 29 Oct 2025 2:09 PM IST

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు బుధవారం నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ సుబేందుతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కలకత్తా హైకోర్టు నుండి జస్టిస్ సుభేందు ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం, ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్ ద్వారకానాధ్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ పార్థసారధి,పలువురు ఇతర రిజిష్ట్రార్లు,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు మరియు హైకోర్టు ఉద్యోగులు, ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story