ఏపీ హైకోర్టు ప్ర‌ధాన‌ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీక‌రించిన‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా

Justice Prashant Kumar Mishra sworn in as Chief Justice of Andhra Pradesh High Court. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బుధ‌వారం

By Medi Samrat  Published on  13 Oct 2021 9:30 AM GMT
ఏపీ హైకోర్టు ప్ర‌ధాన‌ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీక‌రించిన‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా బుధ‌వారం జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్ మిశ్రాతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Next Story