సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన జోయాలుక్కాస్ చైర్మన్‌

Joyalukkas Chairman met CM Jagan. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను

By Medi Samrat  Published on  20 Jan 2023 12:20 PM GMT
సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన జోయాలుక్కాస్ చైర్మన్‌

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రముఖ జువెలరీ బ్రాండ్‌ జోయాలుక్కాస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ అలుక్కాస్‌ వర్గిస్‌ జాయ్ కలిశారు. ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ జరిగిన‌ట్టు సమాచారం. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన‌ట్లు తెలుస్తోంది. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని.. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో జోయాలుక్కాస్‌ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్‌ గ్రూప్‌ చైర్మన్‌ కంది రవిశంకర్ కూడా పాల్గొన్నారు.

Next Story