ఏపీలో ఐఏఎస్‌ల‌ బ‌దిలీ.. పోస్టింగులు కూడా..

IAS transfers in Andhra Pradesh. ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసి, వారికి పోస్టింగులు

By Medi Samrat  Published on  29 May 2021 5:24 AM GMT
ఏపీలో ఐఏఎస్‌ల‌ బ‌దిలీ.. పోస్టింగులు కూడా..

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసి, వారికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ పీ. భాస్కర్‌ను కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేసి, సాంకేతిక విద్య డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక‌ ఏపీ టూరిజం ఎండీగా ఉన్న‌ ప్రవీణ్‌కుమార్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.

అలాగే.. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్‌ అధికారి ఎస్‌. సత్యనారాయణను ఏపీ టూరిజం ఎండీగా నియమించారు. అలాగే పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న మ‌రో అధికారి పీ. బసంత్‌కుమార్‌ను మున్సిపల్‌ శాఖలో ఎంఐజీ ప్రాజెక్ట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించ‌డంతో పాటు.. ఏపీయూఎఫ్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.








Next Story