ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందు.. మోకాళ్ళపై కూర్చున్న ఐఏఎస్ అధికారి

IAS sitting on knees in front of Chief Minister YS Jagan. ఏపీలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఏపీ సర్కార్‌

By అంజి  Published on  27 Jan 2022 9:13 AM GMT
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందు.. మోకాళ్ళపై కూర్చున్న ఐఏఎస్ అధికారి

ఏపీలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఏపీ సర్కార్‌ నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సీఎం జగన్‌.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలతో మాట్లాడారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌, సహా పలువురు నాయకులు ముందు వరుసలో కూర్చున్నారు. వారి వెనుక ఐఏఎస్‌ అధికారులు కూర్చున్నారు. ఈ సందర్భంగా సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ను.. సీఎం జగన్‌ ఏదో విషయమై పిలిచారు.

అయితే సీఎం దగ్గరికి వచ్చిన అధికారి మోకాళ్లపై కూర్చొని మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయంపై ఏపీ ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సీఎం ముందు అధికారి మోకాళ్లపై కూర్చుని మాట్లాడటంపై భిన్నమైన స్పందన వస్తోంది. ఈ ఘటనపై విపక్షాలు ఫైర్‌ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లపై మాజీ కలెక్టర్‌ వెంకట రామయ్య పడ్డారు. ఇది అప్పట్లో సంచలనమే రేపింది.

Next Story