ఆ విషయంపై చర్చిద్దాం.. ఎక్కడికి రమ్మంటారు : రోజా

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

By Medi Samrat
Published on : 26 May 2025 8:15 PM IST

ఆ విషయంపై చర్చిద్దాం.. ఎక్కడికి రమ్మంటారు : రోజా

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను నిలిపివేసిందని, రాష్ట్రంలో అప్పులు, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా చేతులెత్తేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మహానాడులో ఒక తీర్మానం చేయగలరా అని రోజా సవాల్ విసిరారు. ఈ విషయాన్ని ప్రజలతో చెప్పించగలరా? అని ప్రశ్నించారు. దీనిపై చర్చించేందుకు మంగళగిరి, కుప్పం, పిఠాపురం, హిందూపురం ఇలా ఎక్కడికి రమ్మన్నా తాను వస్తానని రోజా తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.

Next Story