చల్లపల్లి రాజా కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి, మచిలీపట్నం పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అంకినీడు ప్రసాద్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం కృష్ణా జిల్లాలోని చల్లపల్లికి తీసుకురానున్నారు. ఆయన చల్లపల్లిలోని శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దూర్ (ఎస్ఆర్వైఎస్పీ) జూనియర్ కళాశాలకు కరస్పాండెంట్గా వ్యవహరిస్తూ విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. మాజీ ఎంపీ అంకినీడు ప్రసాద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.