అమాత్యా మేలుకో..మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు.

By Knakam Karthik
Published on : 29 Jun 2025 4:58 PM IST

Andrapradesh, Ys Jagan, Ap Government, Cm Chandrababu, Nara Lokesh

అమాత్యా మేలుకో..మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ఆయన ఇలా రాసుకొచ్చారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. .మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు..జగన్ ట్వీట్ చేశారు.

Next Story