ఏపీపీఎస్సీ చైర్మన్‌గా.. బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్

Former AP DGP Gautam Sawang takes charge as APPSC chairman. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ గురువారం

By అంజి
Published on : 24 Feb 2022 8:28 PM IST

ఏపీపీఎస్సీ చైర్మన్‌గా.. బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2019 జూన్ నుంచి డీజీపీగా కొనసాగుతున్న ఆయనను వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, బదిలీ సమయంలో గౌతమ్ సవాంగ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జీఏడీకి రిపోర్టు చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించగా, ఏపీపీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు స్వీకరించారు.

కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏపీ డీజీపీగా 1986 బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. అయితే జూలై 31, 2023 వరకు సర్వీస్‌లో ఉండగానే ఆకస్మికంగా గౌతమ్‌ సవాంగ్‌ బదిలీ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా గౌతమ్ సవాంగ్‌పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. మరోవైపు రాష్ట్ర కొత్త డీజీపీగా ఐపీఎస్ అధికారి కె వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం మంగళవారం పునర్‌వ్యవస్థీకరించి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయ్యాక పరిపాలనలో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.

Next Story