ఏపీ క‌రోనా బులిటెన్‌.. రాష్ట్రంలో 314 యాక్టివ్‌ కేసులు

Five New Corona Cases Reported In AP. ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసులు

By Medi Samrat  Published on  29 March 2022 12:10 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. రాష్ట్రంలో 314 యాక్టివ్‌ కేసులు

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసులు వంద లోపే న‌మోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,219 పరీక్షలు నిర్వహించగా.. 05 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,509కి చేరింది. క‌రోనా కార‌ణంగా నిన్న ఎవ్వ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు 14,730 మంది మ‌ర‌ణించారు. 24 గంటల వ్యవధిలో 37 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,04,465కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 314 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,34,15,605 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.








Next Story