కులాలు, పొత్తుల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ఉండవల్లి

Ex MP Undavalli Arun Kumar Key Comments On Politics. రాష్ట్రంలో కమ్మ, రెడ్డి అనే డివిజన్ 2014 నుండి బాగా వచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి

By Medi Samrat  Published on  24 May 2022 11:27 AM GMT
కులాలు, పొత్తుల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ఉండవల్లి

రాష్ట్రంలో కమ్మ, రెడ్డి అనే డివిజన్ 2014 నుండి బాగా వచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. గతంలో అన్నింటిలో కమ్మ డామినేషన్ ఉండేద‌ని.. ఇప్పుడు రెడ్డి డామినేషన్ ఉంద‌ని అన్నారు. గతంలో ముసుగు ఉండేది.. ఇప్పుడు ఆ ముసుగు తీసేశారని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రశ్నించే వాళ్లు లేనప్పుడు అధికారం ఇష్టా రాజ్యంగా మారుతుందని అన్నారు. అధికారం‌ కన్నా పది శాతం ఓట్లు ఇవ్వండి అనే వారిని నమ్మండి.. ఇమేజ్ ఉండి.. ప్రశ్నిస్తా అని ముందుకి వచ్చే వాళ్లని ప్రోత్సహించండని అన్నారు. నేను చాలా అంశాలు చెప్పినా .. మీడియా ఫోకస్ చేయలేదని అన్నారు. పూర్తి పారదర్శక పాలన కోసం ఆన్ లైన్ లో అన్ని అంశాలు ఉంచాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థకి అర్ధమే నేడు మారిపోతుందని.. నేటి మీడియాని క్యాపిట‌లిస్టులు మేనేజ్ చేస్తున్నారని విమ‌ర్శించారు.

నేర స్వభావం ఉన్న వాళ్లనే ప్రజలు అంగీకరిస్తున్నార‌ని.. ప్రజా స్వామ్యంలో అటువంటి వారిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఇటీవల ఒక జడ్జే స్థలం వివాదంలో రౌడీ షీటర్ ను ఆశ్రయించారని ఉద‌హ‌రించారు. కులం ప్రభావం తగ్గితేనే సమాజం బాగు పడుతుందని.. ఎవరికైనా ఒకే కాస్ట్ తో విజయం సాధించడం సాధ్యం కాదని అన్నారు. పవన్ డబ్బు, అధికారానికి లొంగే వ్యక్తి కాదని నా అభిప్రాయం. బిజెపి నిర్ణయాలను బట్టి పొత్తు అంశాలు ఖరారు అవుతాయని తెలిపారు.

ఎపీలో ఎవరు నెగ్గినా 25 ఎంపీలు బీజేపీ వే అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే వెళతారని అనుకుంటున్నాన‌ని అన్నారు. బీజేపీ కాదంటే.. పవన్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోటి కాదు.. ద్విముఖ పోటీ ఉంటుందని అన్నారు. అయితే ఈ అభిప్రాయం ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చెబుతున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ అనంత్ బాబు ది తప్పని తేలితే శిక్షిస్తారని ఉండ‌వ‌ల్లి అన్నారు. అతనే చంపాడని నమ్మే పరిస్థితి కనిపిస్తుందని సందేహం వ్య‌క్తం చేశారు. ఈడీ కేసులలో పెద్ద శిక్షలు పడటం నేను చూడలేదని.. జగన్మోహన్ రెడ్డి కి అయినా జరిమానాలే పడతాయని అన్నారు. ఈడీ కేసులు వినడం ప్రారంభమైతే.. శిక్ష ఖరారు అవుతుందని అన్నారు. ఈ కేసులు వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కు వచ్చిన నష్టం లేదని అన్నారు.

నాడు, నేడు కె.ఎ. పాల్ కి ఎంతో తేడా ఉందని అన్నారు. మొన్న తెలంగాణలో దాడి చేయడం బాధాకరం అని అన్నారు. రాజకీయాలపై అభిప్రాయం చెప్పడం అందరికి హక్కు అని అన్న ఉండ‌వ‌ల్లి.. తెలంగాణలో షర్మిల పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేదని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.






















Next Story